టాప్ స్కీం: జ్వాలా, పొన్నప్ప జోడీకి మద్దతుగా కేసీఆర్, సిద్ధు లెటర్లు
జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్పల జోడీకి రియో ఒలింపిక్స్ టార్గెట్ ఒలింపిక్స్ పోడియం (టాప్) స్కీం జాబితాలో చోటు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేఖ రాశారు. టార్గెట్ ఒలంపిక్ పోడియం (టీఓపీ) పథకం కింద నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ నుండి రియో ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా ఈ ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నారు.
టాప్ స్కీం: జ్వాలా, పొన్నప్ప జోడీకి మద్దతుగా కేసీఆర్, సిద్ధు లెటర్లు
లెటర్లో టాప్ స్కీంకు వచ్చే ఆటల్లో బ్యాట్మింటన్ ఒకటిగా పేర్కొన్నారు. 2016 రియో ఒలంపిక్స్లో మహిళ బ్యాట్మింటన్ విభాగంలో మెడల్ సాధించగలిగే సత్తా ఈ జోడికి ఉందన్నారు. ఇటీవలే ఈ జోడీ కెనడా ఉమెన్స్ డబుల్ టైటిల్ను సాధించినప్పటికీ, వీరిద్దరూ టాప్ స్కీం పరిధిలో లేకపోవడం దురదృష్టకరమన్నారు.
టాప్ స్కీం: జ్వాలా, పొన్నప్ప జోడీకి మద్దతుగా కేసీఆర్, సిద్ధు లెటర్లు
వీరి ఫామ్ను, బ్యాట్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్ దృష్ట్యా జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప జోడి తప్పక రియో ఒలింపిక్స్లో పతకాలు సాధించే అవకాశం ఉందన్నారు. కాబట్టి జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప జోడీని రియో ఒలంపిక్స్ టాప్ స్కీం కింద చేర్చాలని అభ్యర్ధించారు.
టాప్ స్కీం: జ్వాలా, పొన్నప్ప జోడీకి మద్దతుగా కేసీఆర్, సిద్ధు లెటర్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్పల జోడీని రియో ఒలంపిక్స్ టాప్ స్కీంలో చేర్చాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి లెటర్ రాసినట్లు తెలిసింది. కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్పల జోడీని టాప్ స్కీం కింద చేర్చాలని డిమాండ్ చేసిన వారిలో ఉన్నారు.
టాప్ స్కీం: జ్వాలా, పొన్నప్ప జోడీకి మద్దతుగా కేసీఆర్, సిద్ధు లెటర్లు
దీంతో ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా కలగజేసుకోవడంతో జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్పల జోడీని ఒలంపిక్ టాప్ స్కీం కింద చేర్చినట్లు తెలిసింది. అంతేకాదు జ్వాలా గుత్తా, పొన్నప్పల ఖర్చులను భరించేందుకు బ్యాట్మింటన్ సమాఖ్య సంసిద్ధత వ్యక్తం చేసింది.
టాప్ స్కీం: జ్వాలా, పొన్నప్ప జోడీకి మద్దతుగా కేసీఆర్, సిద్ధు లెటర్లు
ఇటీవలే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్కు ఒలింపిక్ టాప్ స్కీం కింద కేంద్ర క్రీడల శాఖ రూ. 9 లక్షల నగదు సాయాన్ని అందించింది. 2016 రియో ఒలంపిక్స్ సన్నాహకాల్లో భాగంగా సైనా నెహ్వాల్ పూర్తి స్ధాయి ఫిజియోథెరిపిస్ట్ కోసం నియమించుకోవాలని కేంద్రాన్ని కోరింది.