న్యూఢిల్లీ: హైదరాబాదీ బ్యాట్మిండన్ స్టార్ జ్వాలా గుత్తా తన ట్విట్టర్లో శనివారం ఓ వినూత్న మైన ఇమేజిని పోస్టు చేసింది. ఈ పోస్టుకు రాహుల్ ద్రవిడ్, మురళీ కార్తీక్ లాంటి క్రికెటర్లు స్పందించారు. అసలు ఇంతరీ జ్వాలా గుత్తా పోస్టు చేసిన పోస్టులో ఏ కనిపిస్తోందంటే... వరుసగా నిల్చున్న నలుగురి కాళ్లు మాత్రమే.
వివరాల్లోకి వెళితే, తన సహచర క్రీడాకారులు అశ్విని పొన్నప్ప, పీవీ సింధు, కోచ్ కింహెర్లతో కలిసి గుత్తా జ్వాల వరుసగా నిల్చుని వెనుక వైపు నుంచి ఓ సెల్ఫీ తీసుకుంది. ఆ సెల్ఫీలో వరుసగా నిల్చున్న నలుగురి కాళ్లు మోకాళ్ల వరకే కనిపిస్తున్నాయి.

ప్యాంట్లను కాస్తంత పైకి జరిపి పిక్కబలం కనిపించేలా తీసిన ఆ సెల్ఫీని సరదాగా ట్విట్టర్లో పోస్ట్ చేసిన గుత్తా జ్వాల, కాళ్లను చూసి తమను గుర్తు పట్టగలరా? అంటూ ట్వీటారు. వినూత్నంగా ఉన్న ఈ పోస్ట్ను చూసిన టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్తో పాటు క్రికెటర్ మురళీ కార్తీక్ సహా పలువురు ఆసక్తికర కామెంట్లు చేశారు.