హైదరాబాద్: గత రెండేళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా, తమిళ నటుడు విష్ణు విశాల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. గురువారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 1:40నిలకు వీరిద్దరూ పెళ్లిచేసుకున్నారు. మొయినాబాద్లో జ్వాల, విష్ణు పెళ్లి వేదిక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బుధవారం రాత్రి జరిగిన మెహందీ ఫంక్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని జ్వాలా గుత్తా ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. మెహందీ వేడుకలకు జ్వాలా పసుపు రంగు లెహంగాలో మెరిసిపోగా.. బ్లాక్ కుర్తాలో విశాల్ సందడి చేశాడు. అంతకుముందు జరిగిన హల్ది వేడుకలో కూడా జ్వాలా మెరిసిపోయారు. ప్రస్తుతం జ్వాల-విశాల్ల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Vishnu Vishal & Jwala Gutta Wedding Photo pic.twitter.com/KkN1GuSvPn
— Trendswood (@Trendswoodcom) April 22, 2021
గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న జ్వాలా గుత్తా, విష్ణు విశాల్ గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉగాది పర్వదినాన తమ లగ్న పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేసిన హీరో విష్ణు విశాల్.. కరోనా కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జ్వాల-విష్ణు ఇద్దరికీ ఇది రెండో వివాహం. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల.. 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. 2010లో రజనీ నటరాజన్ను పెళ్లి చేసుకున్న విష్ణు.. 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నాడు.
విష్ణు విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి జ్వాల గుత్తాను అతడు కలిశాడు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరు ఆపై నిచ్చితార్ధం చేరుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఈ జంటకు ఉండడంతో అన్ని సజావుగా జరిగిపోయాయి. పెళ్లి కోసం విశాల్ చేతిలో ఉన్న సినిమాలను త్వరగా పూర్తిచేయగా.. జ్వాలా కూడా అకాడమీ పనులను పక్కకు పెట్టారు.
KKR vs CSK: సరికొత్త రికార్డు సృష్టించిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్లో ఇదే తొలిసారి!!