న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో రౌండ్లోనే సింధు నిష్క్రమణ, హెచ్ఎస్ ప్రణయ్ కూడా..

 Japan Open: PV Sindhu Crashes Out In Second Round, Kidambi Srikanth Advances

జపాన్: తెలుగు తేజం..స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఓటమి చవి చూసింది. చైనాకు చెందిన 14 సీడ్‌ గావో ఫంగ్జీతో జరిగిన ఉమెన్స్‌ సింగిల్స్‌ రెండో రౌండ్‌లో 18-21, 19-21 తేడాతో సింధు ఓడిపోయింది. గతేడాది అక్టోబరులో డెన్మార్క్‌ ఓపెన్‌లోనూ ఇదే క్రీడాకారిణి చేతిలో సింధు ఓడిపోవడం గమనార్హం.

మరో మ్యాచ్‌లో గెలిచి కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు అడుగుపెట్టాడు. హాంకాంగ్‌కు చెందిన వాంగ్‌ వింగ్‌కి విన్సెట్‌ను 21-15, 21-14తో చిత్తు చేసి పురుషుల సింగిల్స్‌ క్వార్టర్ ‌ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. శ్రీకాంత్‌ తన తర్వాతి మ్యాచ్‌ను కొరియాకు చెందిన లీ డాంగ్‌ కెయిన్‌తో ఆడనున్నాడు.

ఇక మరో మ్యాచ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కూడా ఓటమి చవి చూశాడు. స్టార్‌ ఆటగాడు ఆంథోని సినిసుకతో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ప్రణయ్‌ ఆటకు తెరపడింది.

రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత షెమ్‌- టాన్‌ కియోంగ్‌ (మలేసియా) జంటకు జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో షాకిచ్చిన భారత అగ్రశ్రేణి పురుషుల డబుల్స్‌ జోడీ సుమీత్‌రెడ్డి- మను అత్రిలు కూడా ఓటమి చవి చూశారు. చైనాకు చెందిన జిటింగ్‌, టాన్‌ క్వియాంగ్‌ జోడీ చేతిలో 18-21, 21-16, 12-21 తేడాతో ఈ జోడీ ఓడిపోయింది.

Story first published: Thursday, September 13, 2018, 18:03 [IST]
Other articles published on Sep 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X