భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్స్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్ మ్యాచ్లో ఐదో సీడ్ సింధు 21-14, 17-21, 21-11 తేడాతో మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్) పై విజయం సాధించింది. 62 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సింధు మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది.
ధోనీ రిటైర్ అవుతాడా? కొనసాగుతాడా?.. భవిష్యత్ ప్రణాళికలపై సెలెక్టర్లు ధోనీనే అడగాలి!!
సింధు తొలి గేమ్ను గెలిచి.. రెండో గేమ్లో తడబడింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ షాట్లతో హోరెత్తించి ప్రత్యర్థిని సునాయాసంగా బోల్తా కొట్టిస్తూ 21-11తో గేమ్తో పాటు మ్యాచ్ను చేజిక్కించుకుంది. మియా బ్లిచ్ఫెల్ట్పై సింధుకిది మూడో విజయం. గతంలో ఇండియన్ ఓపెన్, సింగపూర్ ఓపెన్లలో సింధు ఆమెను ఓడించింది. శుక్రవారం జరిగే మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మూడో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు తలపడనుంది. వీరిద్దరూ 14 సార్లు తలపడగా.. చెరో ఏడు సార్లు గెలిచిచారు.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో హైదరాబాదీ ప్లేయర్, 8వ సీడ్ శ్రీకాంత్కు పరాజయం ఎదురైంది. హాంకాంగ్కు చెందిన లాంగ్ అంగూస్ చేతిలో 17-21, 19-21 తేడాతో వరుస గేమ్ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి గేమ్ను నాలుగు పాయింట్ల తేడాతో కోల్పోయినా.. రెండో గేమ్ను కాపాడుకునేందుకు వచ్చిన అవకాశాన్ని శ్రీకాంత్ చేజార్చున్నాడు. ఇక చివర్లో ప్రత్యర్థికి రెండు గేమ్ పాయింట్లను ఇచ్చి ఓడిపోయాడు.
పురుషుల డబుల్స్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 15-21, 14-21తో ఇండోనేషియా టాప్ సీడ్ జోడి మార్కస్ గిడియోన్-కెవిన్ సంజయ చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా 14-21, 11-21తో టాప్ సీడ్ జెంగ్ సి వె-హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయారు.