కెసిఆర్తో గుత్తా జ్వాల
రియో ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా క్రీడాకారులను తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో స్టార్ షట్లర్ గుత్తా జ్వాలకు చోటు దక్కకపోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పందించారు.
కెసిఆర్తో గుత్తా జ్వాల
ఇటీవల కెనడా ఓపెన్ ఛాంపియన్షిప్లో డబుల్స్ టైటిల్ నెగ్గిన జ్వాల, ఎంపి కవితతో కలిసి శుక్రవారం ముఖ్యమంత్రిని కలుసుకుంది.
కెసిఆర్తో గుత్తా జ్వాల
ఈ సందర్భంగా టాప్ పథకం తమకూ వర్తింపజేసేలా చూడాల్సిందిగా సీఎంకు జ్వాల విన్నవించుకుంది.
కెసిఆర్తో గుత్తా జ్వాల
వెంటనే స్పందించిన కేసీఆర్, ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర క్రీడలమంత్రి సర్బనంద సోనోవాల్కు లేఖ రాశారు.
కెసిఆర్తో గుత్తా జ్వాల
అంతర్జాతీయస్థాయిలో ఎన్నో టైటిళ్లు గెలిచి భారత్కు ఖ్యాతి తీసుకొచ్చిన జ్వాల, అశ్విని పొన్నప్పలకూ ఈ పథకం కింద తగిన ప్రోత్సాహకాలను అందించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.