హైదరాబాద్: దేశంలో డబుల్స్ ఆటగాళ్లకు పేరు ప్రఖ్యాతులు రాలేదని, ఇకపై ఆ విభాగంపై పూర్తిగా దృష్టి పెడతానని ఇటీవలే జాతీయ డబుల్స్ కోచ్గా నియమితురాలైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కోచ్ పేర్కొంది.
'బ్యాడ్మింటన్ మరింత మెరుగుపడాలని అనుకుంటున్నా. నేను ఎప్పుడూ డబుల్స్ క్రీడాకారుల గురించే మాట్లాడుతుండేదానిని. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) కొత్త పాలకులు నన్ను కోచ్గా తీసుకోవాలని నిర్ణయించడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్త అధ్యక్షుడు హిమంత విశాల దృక్పథం కలిగిన వ్యక్తి. ఆయనలాంటి వ్యక్తితో బ్యాడ్మింటన్కు ఎంతో మేలు జరుగుతుంది' అని కోచ్గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా జ్వాలా చెప్పింది.
'సింగిల్స్లో భారత్ అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. కానీ డబుల్స్లోనే పరిస్థితి ఘోరంగా ఉంది. అందువల్ల డబుల్స్ను ప్రమోట్ చేయాలనుకుంటున్నా. ప్రజల్లోనే కాదు మీడియాలోనూ ఈ విభాగంపై అవగాహన కలిగించాలని అనుకుంటున్నాను' అని ఆమె పేర్కొంది.
డబుల్స్ ఆటగాళ్లకు స్పాన్సర్లు దొరక్కపోవడంతో యువ షట్లర్లంతా సింగిల్స్పై మొగ్గుచూపుతున్నారని ఆమె చెప్పింది. రాబోయే రోజుల్లో ఐదు అత్యంత పటిష్ట డబుల్స్ జట్లను రూపొందించాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, తన గురువు ఆరిఫ్ సలహాలు, సూచనలతో డబుల్స్ జట్లు తయారు చేస్తానని ఆమె పేర్కొంది.
బ్యాడ్మింటన్కు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించని జ్వాలా గుత్తా త్వరలో దానిపై కూడా ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. 2011 వరల్డ్ ఛాంపియన్షిప్ డబుల్స్ విభాగంలో జ్వాలా గుత్తా కాంస్య పతకం సాధించింది.