జిందాపోల్తో సింధు :
థాయిలాండ్కు చెందిన జిందాపోల్తో సింధు...తొలిరౌండ్లో అమీతుమీ తేల్చుకోనుంది. సింధుకు క్వార్టర్స్లో బింగ్జియావో రూపంలో పెను ప్రమాదం ఎదురవనుంది. మంగళవారం నుంచే హాంకాంగ్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నమెంట్. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో జిందాపోల్ (థాయ్లాండ్)తో సింధు తలపడనుంది.
సూపర్ సిరీస్ లక్ష్యాన్ని మాత్రం ఛేదించలేక
రెండో సీడ్ యమగూచితో తలపడనున్న సైనా.. గాయంతో 2017లో ఎక్కువగా విశ్రాంతికే పరిమితమైంది. 2018లో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో కాంస్యం, ఆసియా ఛాంపియన్షిప్లో కాంస్యంతో మెరిసింది. ఐతే సూపర్ సిరీస్ లక్ష్యాన్ని మాత్రం ఛేదించలేకపోయింది. మూడు సార్లు విజేతగా నిలిచిన ఇండోనేసియా మాస్టర్స్లో ఫైనల్ చేరినా ఫలితం లేకపోయింది.
తొలి రౌండ్లో శ్రీకాంత్.. వోంగ్ వింగ్కిను
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిదాంబి శ్రీకాంత్.. హాంకాంగ్కు చెందిన వోంగ్ వింగ్కి విన్సెంట్ను ఢీకొట్టనున్నాడు. గతేడాది జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్లో గాయం శ్రీకాంత్ను వెనక్కి నెట్టింది. అప్పట్నుంచి ఆటలో వెనుకబడిన శ్రీకాంత్.. ఇప్పటి వరకు కోలుకోలేదు. కామన్వెల్త్ క్రీడల్లో రజతం మినహాయిస్తే శ్రీకాంత్ తరఫున ఈ ఏడాది రాణించిందే లేదు.
ప్రణయ్ తొలిరౌండ్ అధిగమిస్తే
భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ తొలిరౌండ్ అడ్డంకిని అధిగమిస్తే శ్రీకాంత్తో తలపడాల్సి ఉంటుంది. ప్రణయ్, సమీర్, సాయిప్రణీత్ కూడా బరిలో ఉన్నారు. సాత్విక్ సాయిరాజ్ పురుషుల, మిక్స్డ్ డబుల్స్లో పోటీ పడనున్నాడు. మహిళల డబుల్స్లో సిక్కి, పురుషుల డబుల్స్లో సుమీత్ బరిలో ఉన్నారు.