హైదరాబాద్: హాంకాంగ్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరు ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో హాంకాంగ్ చెంగ్ యు చేతిలో 8-21, 18-21, 19-21తో సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. ఆట ప్రారంభం నుంచే సైనాపై చెంగ్ యు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ఏమవుతుందో?: హాంకాంగ్ ఓపెన్ సెమీస్లోకి సింధు
ఇక, రియో ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు హాంకాంగ్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో సింగపూర్ క్రీడాకారిణి షియాయు లియాంగ్పై సింధు విజయం సాధించి సెమీస్లోకి దూసుకెళ్లింది.
మూడు గేమ్స్లో వరుసగా 21-17, 21-23, 21-18 స్కోరుతో లియాంగ్ పై విజయం సాధించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇదిలా ఉంటే శుక్రవారం ప్రకటించిన ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో పీవీ సింధు తొలిసారి సైనా నెహ్వాల్ను వెనక్కినెట్టింది. సింధు రెండు స్ధానాలు ఎగబాకి 9వ ర్యాంకుని దక్కించుకుంది.
మరోవైపు సైనా నెహ్వాల్ 5 స్థానాలు స్థానాలు కోల్పోయి 11వ ర్యాంకుని దక్కించుకుంది. ఎప్పటి నుంచో తనను ఊరిస్తున్న చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ను కైవసం చేసుకున్న సింధు ర్యాంకుని సైతం మెరుగుపరచుకుంది. ఇక సూపర్ సిరీస్ ర్యాంకింగ్స్లోనూ సింధు 10వ, సైనా 11వ స్థానంలో ఉన్నారు.