హైదరాబాద్: ప్రపంచ నంబర్వన్ బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాట్ అందుకున్నాడు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ శుక్రవారం గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో అతని చేతుల మీదుగా ధోని బ్యాట్ను శ్రీకాంత్కు అందజేశాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన శ్రీకాంత్ ఆటను కొనియాడాడు. ధోనీకి శ్రీకాంత్ వీరాభిమాని అని గుర్తు చేశాడు.
'గుంటూరులో శ్రీకాంత్, మేము ఇరుగుపొరుగుగా ఉండేవాళ్లం. శ్రీకాంత్ నాన్న కృష్ణ.. క్రికెట్ అభిమాని. క్రికెట్ను కెరీర్గా ఎంచుకోమని సలహా ఇచ్చింది కూడా ఆయనే. ధోనికి శ్రీకాంత్ వీరాభిమాని. ఒకరోజు ధోని నుంచి ఒక బహుమతి తీసుకురమ్మని అడిగాడు. బ్యాడ్మింటన్లో అత్యున్నత స్థాయికి చేరుకుంటే తప్పకుండా బహుమతి తెస్తానని మాటిచ్చా. ఇదే విషయాన్ని ధోనికి వివరించాను' అని తెలిపాడు.
ఛాంపియన్ అభిమాని అడిగిన కోరికను కాదనలేకపోయాడు ధోనీ. తానూ బ్యాడ్మింటన్ ఆటగాడినని.. శ్రీకాంత్ మ్యాచ్లు తప్పకుండా చూస్తుంటానని ధోని చెప్పాడట. ఈ క్రమంలో ధోని స్వయంగా సంతకం చేసిన బ్యాట్ను శ్రీకాంత్కు ఇవ్వమని ఎమ్మెస్కే ఇంటికి పంపించినట్లు సమాచారం. ప్రపంచ నంబర్వన్గా నిలిచిన శ్రీకాంత్కు ఎమ్మెస్కే శుక్రవారం గోపీచంద్ అకాడమీలో బ్యాట్ను అందజేశాడు.
కిదాంబి శ్రీకాంత్ ఇటీవల విజయాలలో ప్రపంచ నంబర్ వన్గా ఎదగడమే కాకుండా కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్ని కూడా పొందాడు. అతని అభిమాన ఆటగాడి దగ్గరి నుంచే ఎంత ఒత్తిడిలో ఉన్నా ప్రశాంతంగా ఆడే నైపుణ్యాన్ని సంపాదించానని శ్రీకాంత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ నంబర్3గా కొనసాగుతున్నాడు.