ఇది వరుసగా 12వసారి
తై జు చేతిలో ఓడడం సైనాకు ఇది వరుసగా 12వసారి కావడం గమనార్హం. గత ఆదివారం డెన్మార్క్ ఓపెన్ ఫైనల్లోనూ తై జు చేతిలో సైనా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలి గేమ్లో సైనా నెహ్వాల్ దూకుడుగా ఆడింది. కళ్లుచెదిరే షాట్లు ఆడిన సైనా వరుస పాయింట్లతో ప్రత్యర్థిని వెనక్కి నెట్టింది. ఒకానొక దశలో సైనా 16-9తో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
|
అనూహ్యంగా పుంజుకున్న తై జు యింగ్
ఈ సమయంలో తై జు యింగ్ అనూహ్యంగా పుంజుకుంది. వరుస పాయింట్లు సాధించి 15-16తో సైనాను సమీపించింది. ఆ తర్వాత సైనా 20-16తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయి గేమ్ను చేజార్చుకుంది. రెండో గేమ్లో సైనా నెహ్వాల్ దూకుడుగా ఆడలేకపోయింది.
తొలి గేమ్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో
తొలి గేమ్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో విజృంభించిన తైజు 11-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో వరుస పాయింట్లు సాధించి 17-8తో ఆధిక్యంలో నిలిచిన తైజు.. అదే ఊపులో 21-11తో గేమ్తో పాటు మ్యాచ్ గెలుచుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సాయిప్రణీత్ 16-21, 14-21తో జొనాథన్ క్రిస్టి (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు.
క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ
పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21-17, 21-11తో సుమీత్ రెడ్డి-మను అత్రి (భారత్) జోడీపై గెలిచి సెమీస్లోకి ప్రవేశించింది. గురువారం క్వార్టర్ ఫైనల్లో సుమీత్-మను అత్రి జంట 21-16, 21-14తో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ లియు చెంగ్-నాన్ జాంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించింది.