ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ విజయం సాధించారు. చైనీస్ తైపీకి చెందిన లు చింగ్ యావో-యాంగ్ పో హాన్లపై వరుస గేమ్ల విజయంతో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ను కైవసం చేసుకున్నారు. 48 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 21-13, 21-19తో విజయం సాధించింది. 2019 ఎడిషన్లో రన్నరప్గా నిలిచాడు సాత్విక్.
సాత్విక్ ఆంధ్రకు చెందిన ఆటగాడు కాగా చిరాగ్ శెట్టి మహారాష్ట్రకు చెందిన వాడు. ఫైనల్లో యాంగ్లపై భారత జంట తమ వ్యూహాత్మక ఆటను ప్రదర్శించింది. ఈ ఏడాది సాత్విక్-చిరాగ్ జోడీ ఇండియా ఓపెన్ టైటిల్తోపాటు కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం, ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించింది.