
హైదరాబాద్: పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్ రెండో రౌండ్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 21-11, 21-11తో జపాన్ షట్లర్ సేనా కవాకమిపై విజయం సాధించింది.
ఇక, పురుషుల సింగిల్స్లో ఐదోసీడ్ శ్రీకాంత్ 21-19, 21-13తో వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)ను ఓడించగా.... సాయి ప్రణీత్ 21-13, 21-17తో ఇగోర్ కోలె (బ్రెజిల్)పై గెలిచి రెండోరౌండ్ చేరారు. మరో భారత షట్లర్ సమీర్ వర్మ తొలిరౌండ్లో 21-16, 17-21, 15-21 తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు.
పురుషుల డబుల్స్లో భారత్కు చెందిన సుమిత్ రెడ్డి-మను అత్రి జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఈ జంట 21-18, 21-17తో మిన్ హ్యుక్ కాంగ్-కిమ్ వోన్ హో (కొరియా) జోడీ ఓడించింది. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ జోడీ 21-13, 21-15తో జర్మనీ జోడీపై జోన్స్-జోషెపై నెగ్గి రెండోరౌండ్లో ప్రవేశించింది.
మహిళల డబుల్స్ తొలిరౌండ్లో భారత జోడీ మేఘన-పూర్వీషా రామ్ 21-12, 21-12తో లిసె-ఫ్లోరె (బెల్జియం)ను ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో ఈ జోడీ 21-12, 21-12తో లిసీ జేక్స్-వాండెన్ హూక్ (బెల్జియం) జోడీని ఓడించింది.