హైదరాబాద్: దుబాయి సూపర్ సిరిస్ ఫైనల్స్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన నాకౌట్ పోరులో జపాన్ షటర్ల్ అకానె యమగుచిపై 21-9, 21-13తేడాతో ఘన విజయం సాధించి సెమీస్కు చేరింది.
#Badminton Superseries Finals women's singles group match 3:@Pvsindhu1(WR 3) defeats Akane Yamaguchi(WR 2, JPN) to enter semifinal as group top.
— Olympic Press (@OlympicPressOrg) December 15, 2017
Score:21-9,21-13
తొలి సెట్ అరంభం నుంచే దూకుడుగా ఆడిన పీవీ సింధు తన ప్రత్యర్ధి యమగుచికి ఎంతమాత్రం అవకాశం ఇవ్వకుండా సొంతం చేసుకుంది. ఇక, రెండో సెట్లో యమగుచి ఒకానొక సమయంలో సింధుకి గట్టిపోటి ఇచ్చేలా కనిపించింది. 6-4 పాయింట్లలో సింధుపై యమగుచి ఆధిక్యం సాధించింది.
అయితే ఆ తర్వాత వెంటనే పుంజుకున్న సింధు భారీ స్కాష్లతో ప్రత్యర్దిపై పైచేయి సాధించింది. 36 నిమిషాలపాటు సాగిన హోరాహోరీ పోరులో సింధు 21-9, 21-13 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో దుబాయ్ సూపర్ సిరిస్ ఫైనల్స్లో సెమీస్కు చేరింది.
Just in: @Pvsindhu1 beats World No. 2 Akane Yamaguchi 21-9, 21-13 in her final group match. Finishes on top of Group A #DubaiSSF pic.twitter.com/iwAySGFTzo
— India@Sports (@India_AllSports) December 15, 2017
ఈ సూపర్ సిరీస్ గ్రూప్ దశలో మహిళ సింగిల్స్లో ఒక మ్యాచ్లో కూడా ఓడిపోని క్రీడాకారిణిగా సింధు మరో ఘనత సాధించింది. మయగూచిపై విజయం సాధించడంతో గ్రూప్-ఏలో పీవీ సింధు టాపర్గా నిలిచింది. మరోవైపు గ్రూప్-బిలో సెమీస్ బెర్తులు ఇంకా తేలలేదు. చివరి రౌండు ఫలితాల్ని బట్టి గ్రూప్-బీలో సెమీస్ చేరేదెవరో తేలుతుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.