
హైదరాబాద్: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. భారత్ తరఫున చివరిగా బరిలో ఉన్న పీవీ సింధు కూడా క్వార్టర్స్లో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్లో రెండో సీడ్ సింధు 11-21, 10-21తో గావొ ఫాంగ్జీ(చైనా) చేతిలో ఓడిపోయింది.
38నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో పీవీ సింధు ప్రత్యర్ధి గావొ ఫాంగ్జీకి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ప్రస్తుత వరల్డ్ ర్యాంకింగ్స్లో సింధు రెండో స్ధానంలో కొనసాగుతుండగా... ఫాంగ్జీ 89వ ర్యాంకులో కొనసాగుతోంది. సింధుకి ఈ ఓటమి నిజంగా ఊహించని షాకిచ్చింది.
ఇదిలా ఉంటే గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్లు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, గాయం కారణంగా కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.