హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్లో చెన్నై స్మాషర్స్కు మరో షాక్. పి.వి. సింధు సారథ్యంలోని చెన్నై స్మాష్ మాస్టర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ ఓటమి పాలైంది. బుధవారం ఢిల్లీ డాషర్స్ 3-0తో చెన్నైకి షాకిచ్చింది.
పురుషుల డబుల్స్లో మినహాయించి చూస్తే మిగతా నాలుగు మ్యాచ్ల్లో చెన్నైకి ఓటమి తప్పలేదు. తొలి మ్యాచ్నే ఢిల్లీ ట్రంప్ మ్యాచ్గా ఎంచుకుంది. కాగా ఢిల్లీ సుమీత్ రెడ్డి, లీ జోడీ 15-13, 15-11తో ఇవనోవ్, సొజొనోవ్ జంటకు షాకిచ్చింది.
ఆ తర్వాత రెండు పురుషుల సింగిల్స్ మ్యాచ్ల్లో చెన్నై ఓడిపోవడంతో స్కోరు 1-1తో సమమైంది. కీలక మ్యాచ్లో హ్యున్ 11-15, 15-13, 15-14తో సింధుకు షాకివ్వడంతో ఢిల్లీ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆఖర్లో జరిగిన మిక్స్డ్ డబుల్స్ను చెన్నై ట్రంప్ మ్యాచ్గా చేసుకుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే విజయం ఆ జట్టు సొంతమయ్యేది. కానీ, ఢిల్లీ జట్టులోని అశ్విని పొన్నప్ప, ఇవనోవ్ జోడీతో జరిగన పోరాటంలో స్టార్ జోడీ గాబి అడ్కాక్, క్రిస్ అడ్కాక్ జంట గాయం కారణంగా వైదొలగడంతో ఢిల్లీ గెలిచింది.
ఢిల్లీ ఈ అవకాశాన్ని వాడుకుంది. మ్యాచ్ను 3-0తో సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అవధె వారియర్స్ అగ్రస్థానంలోకి చేరిపోయింది. కాగా, చెన్నై ఏడో స్థానంలో ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.