న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్: సింధుకు షాక్, ఢిల్లీ స్మాషర్స్ మరోసారి రాక్

Chennai Smashers suffer unfortunate defeat to Delhi Dashers in PBL

హైదరాబాద్: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో చెన్నై స్మాషర్స్‌కు మరో షాక్. పి.వి. సింధు సారథ్యంలోని చెన్నై స్మాష్ మాస్టర్స్ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఓటమి పాలైంది. బుధవారం ఢిల్లీ డాషర్స్‌ 3-0తో చెన్నైకి షాకిచ్చింది.

పురుషుల డబుల్స్‌లో మినహాయించి చూస్తే మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో చెన్నైకి ఓటమి తప్పలేదు. తొలి మ్యాచ్‌నే ఢిల్లీ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకుంది. కాగా ఢిల్లీ సుమీత్‌ రెడ్డి, లీ జోడీ 15-13, 15-11తో ఇవనోవ్‌, సొజొనోవ్‌ జంటకు షాకిచ్చింది.

ఆ తర్వాత రెండు పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో చెన్నై ఓడిపోవడంతో స్కోరు 1-1తో సమమైంది. కీలక మ్యాచ్‌లో హ్యున్‌ 11-15, 15-13, 15-14తో సింధుకు షాకివ్వడంతో ఢిల్లీ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆఖర్లో జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ను చెన్నై ట్రంప్‌ మ్యాచ్‌గా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే విజయం ఆ జట్టు సొంతమయ్యేది. కానీ, ఢిల్లీ జట్టులోని అశ్విని పొన్నప్ప, ఇవనోవ్‌ జోడీతో జరిగన పోరాటంలో స్టార్‌ జోడీ గాబి అడ్కాక్‌, క్రిస్‌ అడ్కాక్‌ జంట గాయం కారణంగా వైదొలగడంతో ఢిల్లీ గెలిచింది.

ఢిల్లీ ఈ అవకాశాన్ని వాడుకుంది. మ్యాచ్‌ను 3-0తో సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అవధె వారియర్స్‌ అగ్రస్థానంలోకి చేరిపోయింది. కాగా, చెన్నై ఏడో స్థానంలో ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 4, 2018, 9:00 [IST]
Other articles published on Jan 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X