న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింధు గెలుపుతో పీబీఎల్‌లో చెన్నై స్మాషర్స్ బోణీ

By Nageshwara Rao
Chennai Smashers stretched, but finally come good against Mumbai Rockets in PBL

హైదరాబాద్: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) మూడో సీజన్‌‌లో చెన్నై స్మాషర్స్‌ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్ 4-3తేడాతో ముంబై రాకెట్స్‌పై గెలిచింది. తొలి మ్యాచ్‌‌ పురుషుల డబుల్స్‌లో యంగ్‌ లీ-సుమిత్‌ రెడ్డి జంట 9-15, 6-15తో లీ యంగ్‌ డే-బూన్‌ హియోంగ్‌ తన్‌ (ముంబై) జోడీ చేతిలో ఓటమి పాలైంది.

ఆ తర్వాత జరిగిన రెండో సింగిల్స్‌లో బ్రైస్ లెవర్‌డెజ్ (చెన్నై) 15-14, 10-15, 15-14తో సమీర్ వర్మపై చెమటోడ్చి నెగ్గి స్కోరును సమం చేశాడు. ఇక, మహిళల సింగిల్స్‌లో సింధు 12-15, 15-7, 15-9తో బివెన్ జెంగ్‌పై గెలిచి చెన్నైని ఆధిక్యంలో నిలిపింది. అనంతరం రెండో పురుషుల సింగిల్స్‌ పోరును ముంబై ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకుంది.

ఇందులో సన్‌ వాన్‌ హో (ముంబై) 15-11, 15-5తో తనోంగ్సక్‌ సాన్సొంబున్సుక్‌పై గెలుపొందడంతో ముంబై 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ చెన్నైకి ట్రంప్‌ మ్యాచ్‌ కావడంతో చెన్నై జోడీ క్రిస్ అడ్‌కాక్-గాబ్రియెల్ అడ్‌కాక్ 15-9, 13-15, 15-9తో అర్జున్-స్టోయెవాపై గెలవడంతో చెన్నై మ్యాచ్‌ని సొంతం చేసుకుంది.

కాగా, గురువారం జరిగే పోరులో ఢిల్లీ డాషర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్‌ తలపడుతుంది.

Story first published: Thursday, December 28, 2017, 9:39 [IST]
Other articles published on Dec 28, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X