హైదరాబాద్: సినీ నటి చార్మీ తన స్నేహితులతో సరదాగా ఫోటోలు దిగుతూ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా, తన స్నేహితురాలు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో సెల్ఫీని దిగింది.
ఆ సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నా డార్లింగ్ సైనా నెహ్వాల్ అంటూ పేర్కొంది. అంతేకాదు, త్వరలో జరగబోయే టోర్నీల్లో మెడల్స్ అన్నీ నీవే అంటూ అంటూ ట్వీట్ చేసింది. అయితే, వీరు ఏ సందర్భంలో కలిశారో చార్మీ అందులో పేర్కొనలేదు.

ప్రముఖులతో పాటు చాలామంది సెల్ఫీలు దిగి, సామాజిక అనుసంధాన వేదికల్లో అప్ లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ ఓటు వేసి బయటకు వచ్చాక.. కమలం పువ్వుతో సెల్ఫీ దిగిన అంశం చర్చనీయాంశమైంది.