|
ఒకుహరతో 12 మ్యాచ్లు ఆడిన సింధు ఆరింట్లో మాత్రమే
గతంలో ఒకుహరతో 12 మ్యాచ్లు ఆడిన సింధు ఆరింట్లో నెగ్గింది. ఐతే నిరుడు ప్రపంచ ఛాంపియన్షిప్లో పైచేయి ఒకుహరదే. ఆదివారం విజయం సాధించి.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అంతేకాదు ఈ ఏడాది సింగిల్స్లో తొలి టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఇలా భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ విజేతగా నిలిచింది.
|
ఒకుహరపై సింధు అద్భుత పోరాటంతో
ఫైనల్లో రెండో సీడ్ ఒకుహర(జపాన్)పై సింధు అద్భుత పోరాటంతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో గెలిచి టైటిల్ను సొంతం చేసుకుంది. 21-19, 21-17 తేడాతో వరుస సెట్లలో గెలిచి ప్రత్యర్థిని మట్టికరిపించింది. తొలి గేమ్లో సింధు 14-6 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో ఒకుహారా పుంజుకుంది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి సింధు ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత ఒకుహారా రెండు పాయింట్లు సాధించగా, సింధు పాయింట్ మాత్రమే సాధించింది. ఈ దశలో ఒకుహారీ నాలుగు పాయింట్లు సాధించగా, సింధు పాయింట్ దక్కించింది. దాంతో స్కోరు 16-16 గా సమం అయ్యింది.
|
వరుస పాయింట్లతో దుమ్మురేపిన సింధు
అటు తర్వాత జోరు పెంచిన సింధు వరుస పాయింట్లతో దుమ్మురేపింది. తొలుత ఒక పాయింట్ సాధించి ఆధిక్యం సాధించిన సింధు.. వరుసగా రెండు స్మాష్లతో ముందంజ వేసింది. అదే జోరును తిరిగి కొనసాగించడంతో తొలి గేమ్ను సింధు దక్కించుకుంది. ఇక రెండో గేమ్లో సింధు 3-0 తో పైచేయి సాధించింది. ఆపై సింధు రెండు పాయింట్లు, ఒకుహారా నాలుగు పాయింట్లు సాధించడంతో ఇరువురు మధ్య వ్యత్యాసం తగ్గింది.
|
చివరకు మ్యాచ్ను సొంతం చేసుకోవడమే కాకుండా
సింధు మరోసారి విజృంభించి ఆధిక్యాన్ని సాధించింది. రెండో గేమ్లో ఎక్కడ ఆధిక్యాన్ని కోల్పోకుండా వచ్చిన సింధు చివరకు మ్యాచ్ను సొంతం చేసుకోవడమే కాకుండా టైటిల్ను సాధించింది. నిరుడు ఫైనల్లో ఓడిన ఆమె ఈ సారి టైటిల్ను గెలిచి సత్తా చాటింది. ఈ ఏడాది సింగిల్స్లో సింధు ఖాతాలో తొలి టైటిల్ ఇదే కావడం విశేషం.