హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లు సత్తా చాటుతున్నారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ ఈవెంట్లో ప్రీ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు విజయం సాధించింది. హాంకాంగ్కు చెందిన చెయుంగ్పై 19-21, 23-21, 21-17 విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్ ఫైనల్స్లో శుక్రవారం వరల్డ్ నంబర్ 6 ర్యాంకర్ సన్ యుతో పీవీ సింధు పోటీపడనుంది.
After 87 minutes of rigorous badminton, PV Sindhu comes out on top.
— BAI Media (@BAI_Media) August 24, 2017
Defeats Cheung Ngan Yi 19-21, 23-21, 21-17. #2017BWC quarters calling! pic.twitter.com/BRDKlVWLCD
మరోవైపు పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్ఫైనల్కు చేరుకున్నాడు. డెన్మార్క్ ఆటగాడు అండర్స్ అంటోన్స్పై 21-14,21-18 పాయింట్ల తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. దీంతో సింగిల్స్ విభాగంలో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్కు చేరిన సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, అజయ్ జయరాంల సరసన చేరాడు.
13th win on a trot for Srikanth Kidambi. Enters #2017BWC quarterfinals after defeating Antonsen 21-14, 21-18. Sailing smoothly ahead! 🙌 pic.twitter.com/bPEyxGPaeX
— BAI Media (@BAI_Media) August 24, 2017