
బాయ్ 5 లక్షల నజరానా
ఇండోనేషియా ఓపెన్ గెలిచినప్పుడు శ్రీకాంత్కు రూ. 5 లక్షల నజరానా ఇచ్చిన భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్).. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడంతో మరో రూ. 5 లక్షల నజరానా ప్రకటించింది. ‘శ్రీకాంత్ విజయాన్ని చూసి గర్వపడుతున్నాం. ఇది నిజంగా అమోఘం. దేశం గర్వ పడేలా చేయడమే కాకుండా.. ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో తానూ ఒకడినని శ్రీకాంత్ మరోసారి చాటి చెప్పాడు. అతన్ని పొగిడేందుకు మాటలు చాలడం లేదు' అని బాయ్ అధ్యక్షుడు హిమాంత బిస్వా పేర్కొన్నారు.
మహీంద్ర కారు.. బహుమతి
వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్తో సగటు భారతీయుడు గర్వపడేలా చేసిన శ్రీకాంత్కు ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తమ కంపెనీకి చెందిన టీయూవీ 300 కారును బహుమతిగా ఇస్తామని తెలిపారు. అంతేకాదు ఆ కారుని తానే స్వయంగా అతనికి అందజేస్తానని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. క్రికెటర్లు అందుకునే మొత్తంతో పోల్చితే చాలా తక్కువని, టాప్ షట్లర్కు ఏదైనా ఇవ్వాలని ఓ వ్యక్తి చేసిన ట్వీట్కు ఆనంద్ స్పందించారు. ‘ఓకే.. శ్రీకాంత్ పోరాటస్ఫూర్తి మనల్ని గర్వపడేలా చేసింది. స్టీమ్రోలర్కు ఒక యుద్ధ ట్యాంకర్ అవసరం. శ్రీకాంత్కు నా చేతుల మీదుగా టీయూవీ300ను అందిస్తాను' అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.

శ్రీకాంత్ ఇంట సంబరాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్లో విజేతగా నిలిచిన శ్రీకాంత్ సొంతూరు గుంటూరులో తల్లి దండ్రులు సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే ఇండోనేషియా ఓపెన్ నెగ్గిన శ్రీకాంత్ వారం రోజుల వ్యవధిలోనే మరో సూపర్ సిరీస్ టైటిల్ గెలవడంతో అతని తల్లి దండ్రులు కృష్ణ, రాధాముకుంద ఆనందంలో మునిగి పోయారు. మిఠాయిలతో ఆనందాన్ని పంచుకున్నారు.

పుల్లెల గోపీచంద్ ఇలా
'కోర్టులో శ్రీకాంత్ ప్రదర్శించిన పోరాటపటిమ అద్భుతం. మ్యాచ్లో పరిస్థితులకు తగ్గట్టుగా రెండో గేమ్లో అతడు తన వ్యూహాన్ని మార్చుకున్న తీరు ఆకట్టుకుంది. ఈ విజయం ప్రపంచ మేటి ఆటగాడిగా అతడి స్థాయిని పెంచింది. మొత్తానికి నాలుగు వారాల్లో ముగ్గురు భారతీయులు నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలవడం గొప్ప ఘనత. సాయి ప్రణీత్, ప్రణయ్, శ్రీకాంత్ బాగా ఆడారు' అని గోపీచంద్ అన్నాడు.


Click it and Unblock the Notifications