భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఓ స్థానం కోల్పోయాడు. మంగళవారం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్లో శ్రీకాంత్ ఒక స్థానం కోల్పోయి 8వ ర్యాంకులో నిలిచాడు. మరో షట్లర్ హర్షీల్ డాని ఏకంగా 22 ర్యాంకులు మెరుగుపరుచుకుని.. 89వ స్థానంలో కొనసాగుతున్నాడు.
మరో భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 39వ ర్యాంకుకు చేరుకున్నాడు. సమీర్వర్మ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 15వ ర్యాంకులో నిలిచాడు. లక్ష్యసేన్ 71వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరోవైపు సాయిప్రణీత్ (20), ప్రణయ్ (21)లు తమ ర్యాంకులు నిలబెట్టుకున్నారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు (6), సైనా నెహ్వాల్ (9) తమ ర్యాంకుల్లోనే కొనసాగుతున్నారు.