మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో థాయ్లాండ్పై భారత్ 3-2తో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది.
థ్రిల్లర్ మ్యాచ్.. చివరి రెండు బంతుల్లో 2 వికెట్లు.. సఫారీలపై ఇంగ్లాండ్ ప్రతీకారం!!
తొలి సింగిల్స్ మ్యాచ్లో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్ సాయి ప్రణీత్ 14-21, 21-14, 12-21తో వాంగ్చరోన్ చేతిలో ఓడాడు. ఇక రెండో సింగిల్స్లో మరో స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ 20-22, 14-21తో కున్లావత్ వితిద్సరన్ చేతిలో వరుస గేమ్ల్లో పరాజయం పాలయ్యాడు. దీంతో భారత్ 0-2తో వెనుకబడింది. అయితే పుంజుకున్న భారత్.. వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించి సెమీస్కు చేరింది.
మూడో మ్యాచ్గా జరిగిన పురుషుల డబుల్స్లో ధ్రువ్ కపిల-ఎంఆర్ అర్జున్ జోడీ 21-18, 22-20తో కిట్టినుపోంగ్-విరియాంగ్కురా జంటపై విజయాన్ని అందుకున్నారు. నాలుగో మ్యాచ్గా జరిగిన సింగిల్స్లో లక్ష్యసేన్ 21-19, 21-18 చెలరేగి సుప్పను విశింగ్సనోన్పై గెలిచాడు. లక్ష్యసేన్ విజయంతో భారత్ స్కోరును 2-2తో సమం చేసింది.
ఇక నిర్ణయాత్మక ఇదో (రెండో డబుల్స్) మ్యాచ్లో చిరాగ్ శెట్టి-కిదాంబి శ్రీకాంత్ ద్వయం 221-15, 16-21, 21-15తో మనీపాంగ్-నిపిట్ఫాన్ ద్వయంపై నెగ్గడంతో భారత్ విజయం ఖాయమైంది. శనివారం జరిగే సెమీస్లో ఇండోనేషియాతో భారత్ ఆడనుంది. 2016 ఆసియా ఛాంపియన్షిప్ ఇరు జట్లు సెమీస్లోనే తలపడగా.. భారత్పై ఇండోనేషియా పైచేయి సాధించింది. సెమీస్లో భారత్ అడుపెట్టడంతో.. కనీసం కాంస్య పతకం దక్కనుంది.