హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్లు కాంస్య పతకంతోనే సరిపెట్టుకున్నారు. చైనాలోని వుహాన్ వేదికగా జరుగుతోన్న ఈ ఛాంపియన్షిప్ సెమీస్లో సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ కూడా నిరాశే మిగిల్చారు.
శనివారం జరిగిన సెమీ ఫైనల్లో వీరిద్దరూ ఓడిపోయారు. టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్ సెమీస్లో సైనా టాప్సీడ్ తైజు యింగ్(తైపీ)తో తలపడింది. హోరాహోరీగా సాగిన పోరులో సైనా 25-27, 19-21 తేడాతో ఓడిపోయింది. తొలి సెట్ మాత్రం నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో తైజు గేమ్ పాయింట్ సొంతం చేసుకుంది.
Fought like a tigress! @NSaina wins bronze🥉for India 🇮🇳in the WS.
— BAI Media (@BAI_Media) April 28, 2018
It was a sheer delight to watch the way you played, she went down in the semis to defending champion and No 1 seed Tai Tzu Ying 25-27; 18-21. Kudos Champ! #BestofBadminton #BAC2018 pic.twitter.com/6J9bfmmdSJ
దీంతో తొలిసెట్ను తైజు నెగ్గింది. ఇక రెండో సెట్ కూడా అలాగే సాగింది. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ పాయింట్లు సమం చేసుకుంటూ ముందుకు సాగారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో సైనా 19-21తో గేమ్తో పాటు మ్యాచ్ను చేజార్చుకుంది. తైజు యింగ్ చేతిలో సైనా ఓటమి పాలవడం ఇద 11వ సారి.
ఇప్పటి వరకు వీరిద్దరూ 16 సార్లు తలపడగా 11 సార్లు తైజు గెలవగా... ఐదు సార్లు మాత్రమే సైనా విజయం సాధించింది. ఇక, పురుషుల సింగిల్స్ సెమీస్లో ప్రణయ్ 16-21, 18-21తేడాతో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్(చైనా) చేతిలో పరాజయం చెందాడు. 52నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో ప్రణయ్ 21-16, 18-21తేడాతో ఓటమి పాలయ్యాడు.
India's @PRANNOYHSPRI settles for a Bronze🥉Medal at the Badminton Asian Championship as he lost to China's Chen Long 16-21;18-21. You did your best, Champ! #IndiaontheRise #BestofBadminton #BAC2018 pic.twitter.com/zT9M7jpUY5
— BAI Media (@BAI_Media) April 28, 2018