ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సింధు 21-14, 21-9తో చొరున్నిసా (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించింది. వరుస సెట్లలో సింధు అలవోక విజయం సాధించింది. ప్రిక్వార్టర్స్లో జిందాపోల్ (థాయ్లాండ్)తో సింధు తలపడనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
పురుషుల విభాగంలో సమీర్ వర్మ, సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్స్కు చేరుకున్నారు. ఆరో సీడ్ సమీర్ వర్మ 21-15, 16-21, 21-12తో లీ జీ జియా (మలేషియా)పై విజయం సాడ్డించాడు. దీంతో తాజాగా ముగిసిన సుదిర్మన్ కప్లో అతని చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నాడు. ఇక వాంగ్ జు వీ (తైవాన్)తో సమీర్ పోటీ పడనున్నాడు.
సాయి ప్రణీత్ 21-16, 21-14తో లీ డాంగ్ కియూన్ (దక్షిణకొరియా)పై గెలుపొందాడు. తదుపరి రౌండ్లో ఆంథోనీ సినిసుక గింటింగ్ (ఇండోనేషియా)తో ప్రణీత్ తలపడతాడు. పారుపల్లి కశ్యప్ 21-16, 21-15తో సుపన్యు (థాయ్లాండ్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరుకున్నాడు. ఇక ప్రణయ్ 18-21, 19-21తో లిన్ డాన్ (చైనా) చేతిలో ఓడాడు.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజు- చిరాగ్ శెట్టి (భారత్) 21-12, 21-16తో సుమీత్రెడ్డి- మను అత్రి (భారత్)పై గెలుపొందారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప (భారత్) 14-21, 13-21తో బేక్- కిమ్ (కొరియా) చేతిలో ఓడారు.