హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధూకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. హైదరాబాద్లోని లేక్ వ్యూ ప్రభుత్వ అతిథిగృహం ఓఎస్డీగా పోస్టింగ్ ఇస్తూ శనివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రోటోకాల్ విభాగంలోని సహాయ డైరెక్టర్ హోదాను పెంచి ఓఎస్డీగా ఆమెకు పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
రెవెన్యూశాఖలోని సీసీఎల్ఏ విభాగం డిప్యూటీ కలెక్టర్గా పీవీ సింధు ట్రైనింగ్ పూర్తి చేసుకుంది. ట్రైనింగ్ అనంతరం ఆమెకు లేక్ వ్యూ అతిథిగృహం ఓఎస్డీగా పోస్టింగ్ స్వీకరించనున్నారు. అయితే, బాధ్యతలు చేపట్టిన అనంతరం పీవీ సింధు ఆన్ డ్యూటీ లీవ్లో వెళ్లనున్నారు.
లవ్ ద డైలాగ్ సర్: 'నోట్బుక్' సెలబ్రేషన్పై అమితాబ్ ట్వీట్కు విరాట్ కోహ్లీ
ఇటీవలే తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్కు ప్రిపేర్ అయ్యేందుకు అనుమతించాలని కోరారు. దీంతో సింధు అభ్యర్థన మేరకు ఆన్ డ్యూటీ లీవ్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.