
ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించిన సింధు
ఇక రెండో గేమ్లోనూ ఆరంభం నుంచి సింధు ఆధిపత్యం చెలాయించింది. స్కోరు 7-4 వద్ద సింధు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 13-4తో ముందంజ వేసి ఇక వెనుదిరిగి చూడలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో దినార్ దియా అయుస్తిన్ (ఇండోనేసియా)తో సింధు తలపడనుంది.
న జోమి ఒకుహరపై సైనా విజయం
మరో మ్యాచ్లో ఎనిమిదో సీడ్ సైనా 21-15, 21-14తో వరుస గేముల్లో న జోమి ఒకుహర (జపాన్)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ 38 నిమిషాల్లో ముగిసింది. ఇక పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీశాంత్కు చేదు అనుభవం ఎదురైంది. అతను 19-21, 21-19, 12-21తో జహవ్ జున్పెంగ్ (చైనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఖియావ్ బిన్ (చైనా)ను ఓడించిన ప్రణయ్
మరో మ్యాచ్లో ప్రణయ్ 17-21, 22-20, 21-19తో ఖియావ్ బిన్ (చైనా)ను ఓడించాడు. సమీర్ వర్మ 17-21, 12-21తో సకాయ్ (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. అజయ్ జయరామ్ 19-21, 13-21తో హువాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్లో మను అత్రి-సుమిత జోడీ కూడా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది.

అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డిల జోడీ ఓటమి
ఇక మహిళల డబుల్స్ తొలి రౌండ్లో 21-17, 16-21, 24-22తో లారెన్-సారా (ఇంగ్లాండ్)లపై అద్భుత విజయం సాధించిన అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి జోడీ ఆ తర్వాత రెండో రౌండ్లో 15-21, 21-18, 18-21తో నదియా-సనిరు (మలేసియా) జోడీ చేతిలో ఓటమి పాలయ్యారు. మరో మహిళల డబుల్స్ జోడీ మేఘన-పూర్విషా జోడీ 19-21, 12-21తో సు యా చింగ్-వు టి జంగ్ (తైపీ) జోడీ చేతిలో ఓడింది.


Click it and Unblock the Notifications