హైదరాబాద్: ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. భారత జట్లకు మహిళల విభాగానికి సైనా నెహ్వాల్, పురుషుల విభాగానికి ప్రణయ్ నేతృత్వం వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 27 వరకు బ్యాంకాక్లో ఈ టోర్నీ జరగనుంది. ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్, ప్రపంచ నంబర్ 8 హెచ్ఎస్ ప్రణయ్ సారథ్యంలోని భారత యువ షట్లర్లు థామస్ అండ్ ఉబెర్కప్కు సిద్ధమయ్యారు.
ఉబెర్ కప్లో పాల్గొనే మహిళల జట్టులో సైనాతో పాటు వైష్ణవి జక్కారెడ్డి, సాయికృష్ణ ప్రియ, ప్రభు, వైష్ణవి భాలె సింగిల్స్ ఆడనున్నారు. డబుల్స్ బరిలో మేఘన, పూర్విష, ప్రజక్త సావంత్, సంయోగిత ఉన్నారు.
థామస్కప్ పురుషుల సింగిల్స్ లో ప్రణయ్తో పాటు సాయిప్రణీత్, సమీర్ వర్మ, యువ సంచలనం లక్ష్య సేన్ పోటీకి దిగుతున్నారు. పురుషుల డబుల్స్లో సుమీత్రెడ్డి, మనుఆత్రి..రామచంద్రన్, అర్జున జోడి, శన్యం శుక్లా, అరుణ్ జార్జ్ ద్వయం బరిలో ఉన్నారు.
ఉబేర్కప్లో మహిళల సింగిల్స్లో సైనాతో పాటు జూనియర్ ప్రపంచ ఐదో ర్యాంకర్ వైష్ణవి, క్రిష్ణప్రియ, గోవా నుంచి భాయ్ ర్యాంకింగ్ పొందిన తొలి షట్లర్ అనురా ప్రభు, వైష్ణవి భాలే ఉన్నారు. మహిళల డబుల్స్లో మేఘన, పూర్వీశ జోడి, ప్రజక్తా, సంయోగిత తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సింధు, శ్రీకాంత్లతో పాటు మరికొందరు ప్రముఖ షట్లర్లు టోర్నీకి దూరంగా ఉన్నారు.